02-06-2025 01:35:31 AM
రాజేంద్రనగర్, జూన్ 1: మిస్ వరల్ పోటీల్లో పా ల్గొన్న అందాల తారలు తమ స్వదేశాలకు వెళ్ళిపోయా రు. ఈ సందర్భంగా తెలంగాణ సాంస్కృతిక శాఖ, టూ రిజం శాఖ ఆధ్వర్యంలో వారికి ఆదివారం సాయంత్రం ఘనంగా వీడ్కోలు పలికారు. సాంప్రదాయపద్ధంగా కూచిపూడి నృత్యాలతో అమ్మాయిలు వారిని ఎంతో ఘ నంగా సాగనంపారు. సాంస్కృతిక నృత్యాలను చూసి అందాల తారలు అబ్బురపడ్డారు.
ఈ సందర్భంగా వారు ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. సెల్ఫీలు కూడా తీసుకున్నారు. గుడిమల్కాపూర్ లోని కురుగంటి కళాక్షేత్రం రాధిక శిష్య బృందం కూచిపూడి నృత్య ప్రదర్శన చేశారు. అనంతరం వారిని అధికారులు అభినందించారు. తెలంగాణలోని హైదరాబాదులో మిస్ వరల్ పోటీల నేపథ్యంలో ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి అందాల తారలు తరలి వచ్చిన విషయం తెలిసిందే.