calender_icon.png 3 June, 2025 | 4:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కార్మిక వర్గం ఐక్యత సాధించాలి

02-06-2025 01:36:04 AM

సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ప్రభాకర్ 

కామారెడ్డి, జూన్ 1 , (విజయ క్రాంతి),కామారెడ్డి జిల్లా కేంద్రంలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ జిల్లా కార్యాలయంలో టి యు సి ఐ సెంటర్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మొదటి జిల్లా మహాసభల సందర్భంగా ఆహ్వాన సంఘం ఏర్పాటు చేయడానికి ఆదివారం కామారెడ్డి సమావేశం ఏర్పాటు చేశారు .

సమావేశానికి టి యు సి ఐ జిల్లా అధ్యక్షులు ముత్తన్న అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ కార్యదర్శి వర్గ సభ్యులు వి ప్రభాకర్ హాజరై మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక విధులు విధానాలపై చేసే పోరాటలు విజయవంతం కావాలి అంటే అసంఘటిత కార్మికులందరూ ఏకమై వారి హక్కుల కోసం పోరాటాలు నిర్వహించాలని అన్నారు. ప్రపంచ అభివృద్ధి, కార్మికుల పాత్ర రెండూ విడదీయలేనివి.

కార్మికులు లేకుండా ఒక్క క్షణం కూడా ఈ ప్రపంచం మనుగడ సాగించలేదు అని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలు కార్మికుల శ్రమను గుర్తిస్తూ, వారికి పనికి తగ్గ వేతనం, సమాజంలో గౌరవం ఇస్తున్నాయి. కానీ మనదేశంలో కార్మికుల శ్రమకు గుర్తింపు లేకపోగా అడుగడుగునా అవమానాలే. శ్రమకు తగ్గ ఫలితం అటుంచి, కనీస వేతనాల ఊసు కూడా లేదు అన్నారు. ముఖ్యంగా గత 11 సంవత్సరాల మోడీ ప్రభుత్వ పాలనలో కార్మికుల జీవన ప్రమాణాలు మరింత దిగజారాయి అని పేర్కొన్నారు. 

బీజేపీ నాయకత్వంలోని మోడీ ప్రభుత్వం కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్నద అని అన్నారు. పెట్రోల్, డీజిల్ గ్యాస్, ఉప్పు ,పప్పులు, మంచి నూనె వంటి నిత్యావసర వస్తువుల ధరలను విపరీతంగా పెంచింది. పేద,  మధ్యతరగతి ప్రజల వినియోగ వస్తువులపై, రోగుల మందులు, గోలీలపై, చివరకు పిల్లలు చదువులు, చాక్ పీసులు, పెన్సిల్ ల పైన కూడా టాక్స్ లు వేస్తున్నది. 

సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్న హామీని నిలబెట్టుకోలేదు అని తెలిపారు. పైగా వున్న ఉద్యోగాలను తొలగిస్తున్నద నీ అన్నారు. ప్రభుత్వ సంస్థలను కార్పొరేట్ కంపెనీలకు అమ్మేస్తున్నదని అన్నారు. కార్మికులకు ఉద్యోగ, ఆరోగ్య భద్రతను దూరం చేస్తున్నద అన్నారు.  కార్మికుల హక్కులను అడుగడుగునా కాలరాస్తున్నది బిజెపి ప్రభుత్వం అన్నారు. కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను హరించివేస్తున్నదని అన్నారు.

కార్పొరేట్ కంపెనీలకు అనుకూలమైన చట్టాలు తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నది. అందులో భాగంగానే దశాబ్దాలుగా కార్మికులు పోరాడి సాధించుకున్న చట్టాలను రద్దుచేసి, కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్ లను తెచ్చి అమలు చేయాలని చూస్తున్నదన్నారు. కార్మికుల 8 గంటల పని విధానం రద్దుచేసి, 12 గంటల పని విధానాన్ని తీసుకొచ్చి, కార్మికులతో వెట్టిచాకిరి చేయించే కుట్రలు చేస్తున్నది.

మోడీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను బీజేపీ పాలిత రాష్ట్రాల్లో యదేచ్చగా అమలు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో గత కేసిఆర్ ప్రభుత్వం, ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వం అటు ఇటుగా కేంద్ర ప్రభుత్వ వైఖరినే అవలంబిస్తున్నాయి. కార్మికుల శ్రేయస్సును పట్టించుకోవడం లేదు.  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాల్సిన బాధ్యత ప్రధానంగా కార్మికవర్గం పైనే ఉన్నది.

ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో, ముఖ్యంగా మన జిల్లాలో మున్సిపల్, గ్రామపంచాయతీ కేజీబీవీ, మోడల్ స్కూల్, మిషన్ భగీరథ, భవన నిర్మాణ,  ఆటో,మోటార్ వర్కర్స్, హమాలీ, ఇతర రంగాలు, బీడీ కార్మికులు ఎదుర్కొంటున్న అనేక సమస్యల పరిష్కారం కోసం, వేతనాల పెంపు, ఉద్యోగ ఆరోగ్య భద్రత కోసం మన యూనియన్ రాజీ లేకుండా పోరాడిందని అన్నారు.  మరెన్నో విజయాలను సాధించాల్సింది ఉందని అన్నారు.

ఈ మహాసభలను జయప్రదం చేయాలని జిల్లాలోని అన్ని రంగాల కార్మికులు, ప్రజలు ప్రజాస్వామ్యవాదులు, ఉద్యోగ, మేధావులు, వ్యాపార వర్గాలు, వివిధ సంస్థలకు విజ్ఞప్తి చేస్తున్నాం.  సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ కామారెడ్డి జిల్లా కార్యదర్శి పి. రామకృష్ణ, రాష్ట్ర నాయకులు బి దేవారం, టి యు సి ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి రమేష్, జిల్లా నాయకులు ప్రకాష్ ,పి ఓ డబ్ల్యు జిల్లా నాయకులు అనిత, రాజేశ్వర్ ,బాబన్న, కిషన్, రమేష్, కిషోర్, పిడిఎస్యు జిల్లా అధ్యక్షుడు సురేష్, నరేందర్ ,అనిల్. రాందాస్ దామోదర్ నడిపి నరసయ్య రాజన్న , పాల్గొన్నారు.