24-06-2025 11:05:13 PM
సిఐటియు జిల్లా అధ్యక్షుడు కదిరే రమేష్..
హుజురాబాద్ (విజయక్రాంతి): జూలై 9వ జరునున్న దేశభక్తి కార్మికుల సమ్మెను విజయవంతం చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షుడు కదిరి రమేష్(CITU District President Kadiri Ramesh) పిలుపునిచ్చారు. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ పట్టణంలోని ప్రతాప సాయి గార్డెన్లో సిఐటియు జిల్లా భవన కార్మిక సమావేశం మంగళవారం కదిరి రమేష్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రం తీసుకొచ్చిన నాలుగు కార్మిక చట్టాలు కార్మిక హక్కులను హరించే విధంగా ఉన్నాయని ఆరోపించారు.
యూనియన్ హక్కు, ఫిర్యాదు చేసే హక్కు, కనీస వేతనం, పని భద్రత లాంటి హక్కులు ఈ చట్టాల ద్వారా కార్మికులు హక్కులు నీరుగారుతున్నాయని అన్నారు. సెస్ నిధులు కార్పొరేటర్లకు లాభం చేకూర్చే లాగా మళ్లించేందుకు ఈ చట్టాలు కేంద్ర ప్రభుత్వం రూపొందించిందని ఆరోపించారు. గ్రామ గ్రామాన సమావేశాలు నిర్వహించి కేంద్ర ప్రభుత్వ వైఖరిని ప్రజలకు తెలియజేస్తామని అన్నారు. కార్మికులు దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వెంకన్న, తిరుపతి, రేణిగుంట సారయ్య, సిహెచ్ కొమురయ్య, రాజకుమారి, సుధాకర్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.