4 May, 2026 | 12:38 PM

Breaking News

22వ వార్డులో డ్రైనేజ్ సమస్యకు పరిష్కారం.. నూతన నిర్మాణ పనులు ప్రారంభం   •   సేంద్రియ పద్ధతి ద్వారా అధిక దిగుబడి   •   తిరుపతి జిల్లాలో ఘోరప్ర‌మాదం: ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన‌ అంబులెన్స్.. నలుగురు మృతి   •   37 వ డివిజన్ అభివృద్ధికి సహకరించండి   •   కొడుకు సాయంతో ప్రియుడిని హత్య చేసిన వివాహిత   •   Tamil Nadu Election Results 2026: తమిళనాడులో విజయ్ TVK ప్రభంజనం   •   Assam Election Results 2026: అస్సాంలో BJP ముందంజ   •   నూతన వధూవరులను ఆశీర్వదించిన మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, పలువురు ప్రముఖులు   •   తిరుమలాయపాలెంలో ‘రైతువారం’ – అవగాహన సదస్సులకు ఏఓ పిలుపు   •   సాయం చేద్దామని వెళ్తే.. ఎనిమిది మంది ప్రాణాలు పోయాయి..!   •  

యూరియా కోసం రైతుల ఆందోళన

04-03-2026 02:49 PM

నిజాంసాగర్,(విజయక్రాంతి): మహమ్మద్ నగర్ మండలంలోని గునుకుల్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం మహమ్మద్ నగర్  వద్ద బుధవారం ఉదయం యూరియా కొరతతో రైతులు ఆందోళనకు దిగారు. సొసైటీ గోదాంకు ఉదయం 666 యూరియా బస్తాలు చేరుకున్నట్లు సమాచారం అందడంతో రైతులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. రైతులు యూరియా యాప్‌లో బుకింగ్ చేసుకునేందుకు సిద్ధమయ్యేలోపే నిమిషంలోనే మొత్తం 666 బస్తాలు ఖాళీ అయినట్లు యాప్‌లో చూపించడంతో వారు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

తమకు యాప్‌లో స్టాక్ లేదు అని చూపెడుతుండగా, ఈ బస్తాలు ఎవరికి బుక్ అయ్యాయి ఎక్కడికి వెళ్లాయి అనే ప్రశ్నలతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సొసైటీ కార్యాలయం వద్ద రైతులు అధికారుల కోసం వేచి చూసినప్పటికీ వ్యవసాయ శాఖ అధికారులు అక్కడికి రాలేదని రైతులు ఆరోపించారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఒక్కసారిగా ఆగ్రహించిన రైతులు సొసైటీ అధికారులను నిలదీసే క్రమంలో కార్యాలయ క్యాబిన్‌కు గల అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసమయ్యాయి. అనంతరం సొసైటీ అధికారులు రైతులతో మాట్లాడి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. యూరియా సరఫరా, ఆన్‌లైన్ బుకింగ్ వ్యవస్థలో పారదర్శకత కల్పించాలని రైతులు డిమాండ్ చేశారు.