ధైర్యంగా ఉండండి ఆందోళన వద్దు
ప్రభుత్వం నుండి పరిహారం అందేలా కృషి చేస్తా ఎమ్మెల్యే
బోథ్,(విజయక్రాంతి): అగ్ని ప్రమాదంలో కనుగుట్ట గ్రామ రైతులకు తీరని నష్టం సంభవించిందని నష్టాన్ని భర్తీ చేయడం సాధ్యం కాదని అయితే తాను రైతులకు జరిగిన నష్టాన్ని పూర్తిస్థాయిలో ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుందని స్థానిక శాసనసభ్యులు అనిల్ జాదవ్ పేర్కొన్నారు. రైతులు ధైర్యం కోల్పోవద్దని తాను అండగా ఉంటానన్నారు. రైతులకు జరిగిన పంట నష్టం విషయమై జిల్లా కలెక్టర్కు వివరించడం జరిగిందన్నారు.
అంతేగాక ప్రభుత్వానికి సహితం ఈ విషయాన్ని తెలుపమన్నారు. దురదృష్టకరమైన ఈ సంఘటన వల్ల రైతు జీవితాలు అంధకారంగా మారుతున్నాయని వ్యవసాయాన్ని నమ్ముకుని జీవిస్తున్న రైతులకు ప్రభుత్వపరంగా ఎంత చేసినా తక్కువనేనని పేర్కొన్నారు. ఆయన వెంట మాజీ జెడ్పిటిసి సంధ్యారాణి మాజీ ఎంపీపీ కుల శ్రీనివాస్ మండల పార్టీ కన్వీనర్ ఎల్కరాజు యూత్ అధ్యక్షులు ప్రవీణ్ తోపాటు కనుగుట్ట గ్రామ రైతులు ఉన్నారు






