రైతు ఉత్సవాలలో పాల్గొన్న మొద్దులగూడెం రైతులు
దమ్మపేట, మార్చి 22 (విజయక్రాంతి): దమ్మపేట మండలం, మొద్దులగూడెం గ్రామానికి చెందిన రైతులు రైతు ఉత్సవాలలో భాగంగా గండుగులపల్లి రైతు వేదికలో ఏర్పాటు చేసిన వేదిక ద్వారా ప్రత్యక్షంగా వీక్షించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు మోరంపూడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రైతులను రాజు చేయాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని ఇందులో భాగంగానే మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ లో రైతుసంక్షేమానికి 23 వేల కోట్ల రూపాయలు కేటాయించడం హర్షించదగ్గ విషయం అన్నారు.
ఆయిల్ ఫామ్ సాగు తోనే రైతుల జీవితాలు బాగుపడతాయని, వీలైనంతవరకు ప్రతి రైతు ఆయిల్ ఫామ్ సాగు చేయటానికి ప్రయత్నం చేయాలని, వీలైనంత త్వరగా ఆయిల్ ఫామ్ రిఫైనరీ ని అప్పారావుపేటలో ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏ ఇ ఓ వినోద్, ఆత్మ కమిటీ డైరెక్టర్ బొంతు హిమబిందు, గణపా రాము, కర్లపూడి బాలు , బొంతు రాజశేఖర్ తదితర రైతులు పాల్గొన్నారు.




