06-02-2026 12:05:58 PM
సాగు నీటిని వెంటనే విడుదల చేయాలి..
సిద్ధిపేట ముస్తాబాద్ రోడ్డుపై రైతుల రాస్తారోకో..
సిద్దిపేట రూరల్: మల్లన్న సాగర్ కెనాల్ నుండి వెంటనే నీటిని విడుదల చేసి తమ పంటలను కాపాడాలని చింతమడక సీతారాంపల్లి మాచాపూర్ వెంకట్రావుపల్లి బదనకల్ గ్రామాల రైతులు అన్నారు శుక్రవారం లక్ష్మీదేవి పల్లి చింతమడక గ్రామాల సరిహద్దు వద్ద ముస్తాబాద్ రోడ్డుపై తమకు వెంటనే సాగునీటిని విడుదల చేయాలని కోరుతూ రాస్తారోకో నిర్వహించారు. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోగా, పోలీసులు జోక్యం చేసుకుని రైతులను సముదాయించి అక్కడి నుండి పంపించి వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సాగునీటిని విడుదల చేయాలని ఎన్నిసార్లు కోరిన అధికారులు పట్టించుకోకపోవడం లేదని అన్నారు.