27-05-2025 08:58:33 PM
సారంగాపూర్ (విజయక్రాంతి): అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని తరుగు తీయకుండా ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ సారంగాపూర్ మండలంలోని ధని గ్రామం వద్ద స్వర్ణ- నిర్మల్ రహదారిపై మంగళవారం రైతులు రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ... గత వారం రోజుల నుండి కురుస్తున్న వర్షాలకు ధాన్యం తడిసి మొలకెత్తిందని ఐకెపి సెంటర్ నిర్వాహకులు సరైన సమయంలో కొనుగోలు చేయకపోవడంతో విక్రయానికి తీసుకువచ్చిన వరి ధాన్యం నీటి పాలవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే లారీల కొరత మూలంగా ధాన్యం రైస్ మిల్లులకు తరలించకపోవడంతో చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు గిట్టుబాటు ధర పెంచడంతో పాటు నష్టపరిహారం కూడా అందజేయాలని డిమాండ్ చేశారు.