24-06-2025 01:52:40 AM
రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి
హైదరాబాద్, జూన్ 23 (విజయక్రాంతి): నకిలీ పత్తి విత్తనాలతో నష్టపోయిన జోగులాంబ గద్వాల జిల్లా రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని సీడ్ కంపెనీలకు రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి సూచించారు. జీవోటీ పేరుతో సీడ్ కంపెనీలు రైతులను మోసం చేస్తున్నాయని రైతు కమిషన్కు జిల్లా రైతులు ఫిర్యాదు చేయడంతో.. రైతు కమిషన్ ఆ జిల్లాలో పర్యటించిన విషయం తెలిసిందే.
సోమవారం సీడ్ కంపెనీలతో రైతు కమిషన్ చైర్మన్ సమావేశం నిర్వహించి.. రైతులకు జరిగిన నష్టంపై చర్చించారు. నష్టపోయిన రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత సీడ్ కంపెనీలపై ఉందని ఆయన గుర్తు చేశారు. సమావేశంలో సీడ్ కంపెనీల ప్రతినిధుల తో పాటు మాజీ ఎమ్మెల్యే సంపత్కుమార్, కమిషన్ సభ్యులు కేవీఎన్రెడ్డి, గోపాల్రెడ్డి, రాములునాయక్, భవానీరెడ్డి, కమిషన్ సలహాదారులు దొంతి నర్సింహారెడ్డి, రామంజనేయులు, శ్రీనివాస్రెడ్డి, మెంబర్ సెక్రటరీ గోవింద్ తదితరులు పాల్గొన్నారు.