17 April, 2026 | 3:12 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయా దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

రైతులు రోడ్లపై వరి ధాన్యం పోయకుండా పోలీసులకు సహకరించాలి

04-04-2025 09:08 PM

హుజురాబాద్ సిఐ తిరుమల్ గౌడ్

హుజురాబాద్,విజయక్రాంతి: హుజురాబాద్ మండలంలో వరి కోతలు మొదలయ్యాయని, రైతులెవ్వరు రోడ్లపై వరి ధాన్యాన్ని పోయకుండా పోలీసులకు సహకరించాలని హుజురాబాద్ సిఐ తిరుమల్ గౌడ్ రైతులను విజ్ఞప్తి చేశారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని పోలీస్ స్టేషన్లో శుక్రవారం   రైతులను ఉద్దేశించి  ఆయన మాట్లాడుతూ.. రైతులు రోడ్లపై దాన్యం పోయడం వల్ల వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. రాత్రిపూట వాహనాలు నడిపే వాహనదారులకు ధాన్యం కనిపించకపోవడంతో ప్రమాదాలకు గురవుతున్నారని,గతంలో రోడ్లపై ధాన్యం పోయడం వల్ల చాలా ప్రమాదాలు జరిగి ప్రాణ నష్టం జరిగిన సంఘటనలు మర్చిపోకూడదని అన్నారు. దయచేసి రైతులు ఎవరు రోడ్లపై ధాన్యాన్ని పోయావద్దని కోరారు.