17 April, 2026 | 10:27 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

రైతులకు ఇబ్బందులు ఉండకూడదు

10-06-2025 01:03 AM
  1. నకిలీ విత్తనాలు మార్కెట్ లోకి రాకుండా చర్యలు చేపట్టాలి

కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకటరమణ రెడ్డి

కామారెడ్డి, జూన్ 9 (విజయ క్రాంతి), రైతులకు కర్రీ పండ విత్తనాల విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్త లేకుండా వ్యవసాయ శాఖ అధికారులు చర్యలు చేపట్టాలని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రైతులకు అవసరమైన, విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచాలని సూచించారు.

నకిలీ విత్తనాలు మార్కెట్ లోకి రాకుండా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. రైతులకు వ్యవసాయ శాఖ అధికారులు అందుబాటులో ఉండాలని సూచించారు. యూరియా, డిఎపి వంటి ఎరువుల కొరత రాకుండా చూడాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి, జాయింట్ డైరెక్టర్ డైరెక్టతిరుమల ప్రసాద్, అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ సంతోష్ కుమార్, కామారెడ్డి నియోజకవర్గంలోని మండల వ్యవసాయ అధికారులు, ఏ ఈ ఓ లు పాల్గొన్నారు

ఖరీఫ్ పంటల సీజన్ ప్రారంభం అయిన సందర్భంగా కామారెడ్డి నియోజకవర్గ పరిధిలోని వ్యవసాయ అధికారులతో ఎంఎల్‌ఏ క్యాంపు కార్యాలయంలో  కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణ రెడ్డి సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి మాట్లాడుతూ ఈ రైతులకు ఖరీఫ్ పంటకి విత్తనాల విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదనీ, విత్తనాల కొరత ఏర్పడకూడదు అని  నకిలీ విత్తనాలు మార్కెట్ లోకి రాకుండా చర్యలు చేపట్టాలన్నారు.