calender_icon.png 6 June, 2025 | 6:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ వైఫల్యంతో రైతులకు కష్టాలు

02-06-2025 12:00:00 AM

ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి

నిర్మల్ జూన్ 1 (విజయక్రాంతి) : సొన్ మండలం పాక్పట్ల గ్రామంలోని వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి పరిశీలించారు.  రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని, తడిసిన ధాన్యం ను సైతం ప్రభుత్వం పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలని అధికారులకు ఆదేశించారు. కొనుగోలు ప్రక్రియలో జాప్యం పై ఆరా తీశారు. తప్ప, మ్యాచర్ పేరుతో రైతులను మోసగిస్తే సహించే ప్రసక్తే లేదన్నారు.

రైతులను దోపిడి చేసే రైస్ మిల్లర్లపై చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్ రెడ్డి, నాయకులు రావుల రాంనాథ్, సరికెల గంగ న్న, మండల అధ్యక్షులు మార గంగారెడ్డి, నాయకులు రమేష్ రెడ్డి, జక్క రాజేశ్వర్,  నర్సారెడ్డి, ముత్యం, నర్స య్య, గంగారెడ్డి, భీముడు, పోషెట్టి తో పాటు తదితరులు పాల్గొన్నారు.