calender_icon.png 8 June, 2025 | 2:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వృత్తిదారుల సంఘం నూతన అధ్యక్షుడి ఎన్నిక

02-06-2025 12:00:00 AM

చార్మినార్, జూన్ 1 (విజయ క్రాం తి): లాల్ దర్వాజా ఉమ్మడి దేవాలయా ల వృత్తిదారుల సంఘం నూతనగా కమిటీని ఆదివారం పూల్ బగ్ శ్రీ వెంకటేశ్వర దేవాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎన్నుకున్నారు.అధ్యకుడిగా పేరోజి మహేశ్వర్ ,ప్రధాన కార్య దర్శిగా కొల్లూరు జ్ఞానేశ్వర్,కోశాధికారిగా గట్టు సుదర్శన్ ను ఎన్నుకు న్నారు.ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు మహేశ్వర్ మాట్లాడుతూ..

తెలంగాణలో ఎంతో ప్రతిష్టాత్మకమైన అమ్మవారి బోనాల జాతర ఉత్సవాల సం దర్భంగా నగరంలో పలు దేవాలయాలలో వృత్తిదారుల సంఘం అనేక పూ జా కార్యక్రమాలు చేపడుతుందన్నారు. తెలంగాణ సాంప్రదాయం, సాంస్కృతికలతో పాటు అమ్మవార్ల దేవాలయాల చరిత్ర బోనాల పండుగ చేసుకోవడానికి గల ముఖ్య కారణాలను సంఘం తరఫున విస్తృతంగా ప్రచారం చేస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమ్మవారి సేవలో ఉన్న వారిని గుర్తించి తగిన సౌకర్యాలు తోపాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఇచ్చి ఆదుకోవాలని కోరారు.