వర్షం.. పంటలకు ప్రాణం
21-07-2026 03:47 PM
వాంకిడి,(విజయక్రాంతి): గత వారం రోజులుగా వర్షాలు ముఖం చాటేయడంతో వాంకిడి మండల రైతులు ఆందోళన చెందారు. సోమవారం రాత్రి నుంచి మండల కేంద్రంతో పాటు మండలంలోని వివిధ గ్రామాల్లో ఓ మోస్తారు వర్షం కురుస్తుంది. దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేశారు. సాగు పనుల్లో నిమగ్నం అయ్యారు. మండలంలో అత్యధికంగా సుమారు 38 వేల ఎకరాల్లో పత్తి, 3 వేల ఎకరాల్లో కంది, వేయి ఎకరాల్లో పెసర, మిర్ప, వరి, సోయాబీన్ వంటి తదితర పంటలను రైతులు సాగు చేస్తున్నారు. తాజాగా కురిసిన వర్షం పంట మొక్కలకు ప్రాణం పోసినట్ లైంది. మరో రెండు రోజులు వర్షాలు కురుస్తాయనే వాతావరణ శాఖ ప్రకటనతో అన్నదాతల్లో ఆశలు చిగురించాయి.






