21 July, 2026 | 7:25 PM

Breaking News

జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలి   •   అమ్మ నగర్ బ్రిడ్జితో దూరభారం తగ్గుతుంది   •   నీట్ పరీక్ష పత్రాల లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేందర్ ప్రధాన్ రాజీనామా చేయాలి   •   జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో యువతి అదృశ్యం   •   సీజనల్ వ్యాధులు ప్రబలకుండా విస్తృత అవగాహన   •   సుల్తానాబాద్ మున్సిపాలిటీ 17 బూతుల బిఎల్ఎ 2 ల సమావేశం   •   ఫోటో, వీడియో గ్రాఫర్ల కు అండగా ఉంటాం: మేయర్ కొలగాని   •   ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ ప్రక్రియలో వేగం పెంచాలి   •   సర్పంచ్ పగడాల రమాదేవి అధ్వర్యంలో తడి–పొడి చెత్త బుట్టల పంపిణీ   •   ఇల్లందు–బొమ్మనపల్లి ట్రాఫిక్ డైవర్షన్ ఎత్తివేత   •  

ఎమ్మెల్యేకు వినతి పత్రం

21-07-2026 03:45 PM

నిర్మల్,(విజయక్రాంతి): టీజీ ఆర్టీసీలో పనిచేసిన రిటైర్డ్ ఉద్యోగుల సమస్యల పరిశీలించినందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు మంగళవారం నేత నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డికి వినతిపత్రం అందించారు. ఆర్టీసీలో 38 సంవత్సరాల పాటు సేవలందించి పదవీ విరమణ పొందిన 34,188 మంది ఉద్యోగులకు 2017, 2021 సంవత్సరాలకు సంబంధించిన పీఆర్సీ బకాయిలు ఇప్పటికీ అందలేదని తెలిపారు.

పదవీ విరమణ అనంతరం ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలు ఆలస్యం కావడంతో కుటుంబ పోషణ, వైద్య ఖర్చులు, ఇతర కనీస అవసరాలు తీర్చుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే రాబోయే వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశాన్ని ప్రస్తావించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డిని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా తమ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని రిటైర్డ్ ఉద్యోగుల సంఘం సభ్యులు ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు.