02-07-2025 10:32:48 PM
5 గురుకి గాయాలు..
బంధుమిత్రులతో కలిసి విహార యాత్రలో విషాదం..
తిరుగు ప్రయాణంలో ఈ దుర్ఘటన..
కొత్తకోట: కుటుంబ సభ్యులు బంధుమిత్రులతో కలిసి సరదాగ విహారయాత్రకు బయలుదేరారు. విహార యాత్ర ముగించుకొని తిరుగు ప్రయాణంలో తమిళనాడు రాష్టం ధర్మపురి సమీపంలో అతి వేగంగా వస్తున్నా లారీ వీరు ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టింది. కారులో ఉన్న ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందగా, ఐదుగురికి తీవ్రగాయలైన సంఘటన తమిళనాడులో జరిగింది. సమీప బంధువుల వివరాల ప్రకారం... వనపర్తి జిల్లా(Wanaparthy District) కొత్తకోట మండలం పాలెం గ్రామానికి చెందిన సాయి దాబా రాజు తమ కుటుంబం, బంధుమిత్రులతో కలిసి రెండు వాహనాల్లో కర్ణాటక, తమిళనాడు, ఆయా రాష్టాలకు విహాయ యాత్రకు బయలుదేరారు.
కారులో విహారయాత్ర ముగించుకొని తిరుగు ప్రయాణంలో తమిళనాడు రాష్టం ధర్మపురి సమీపంలో వస్తుండగా అతి వేగంగా వస్తున్నా లారీ కారును బలంగా ఢీకొట్టింది. అందులో వనపర్తి జిల్లా మదనాపురం మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన సునీతమ్మ(65), పెద్ద మందడి మండలం దొడగుంటపల్లి గ్రామానికి చెందిన యుగేందర్ రెడ్డి(45) అక్కడిక్కడే మృతి చెందారు. మరో 5 గురికి తీవ్ర గాయాలు కావడంతో బెంగళూరు హాస్పిటల్ కు తరలించారు. జరిగిన సంఘటనపై తమిళనాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బంధువులు తెలిపారు.