28-06-2025 08:14:18 PM
మంచిర్యాల,(విజయక్రాంతి): మంచిర్యాల పట్టణంలోని లక్ష్మీనగర్ శ్రీ చైతన్య టెక్నో స్కూల్ బ్రాంచ్లో శనివారం ఫాదర్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. విద్యార్థుల ఫాదర్స్ ఆటల పోటీలలో పాల్గొన్నారు. విజేతలకు మంచిర్యాల అసిస్టెంట్ జనరల్ మేనేజర్ అరవింద్ రెడ్డి, ప్రిన్సిపాల్ అయూబ్ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక సమన్వయకర్త జయశ్రీ, ఇన్ఛార్జ్ అనగమాత, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.