28-06-2025 08:10:28 PM
నిర్మల్ లో ప్రెస్ క్లబ్ ప్రమాణ స్వీకారోత్సవం
నిర్మల్,(విజయక్రాంతి): సమాజ అభివృద్ధి కోసం నిస్వార్థంగా పనిచేసేది ఒక పాత్రికేయని వారి సంక్షేమానికి తమ వంతు సహకారాన్ని అందిస్తామని నిర్మల్ ఎమ్మెల్యే బీజేఎల్పి నేత మహేశ్వర్ రెడ్డి మాజీ మంత్రి ఏ ఇంద్రకన్ రెడ్డి డిసిసి అధ్యక్షులు శ్రీహరి రావు అన్నారు. పట్టణంలోని ఆర్కే ఫంక్షన్ హాల్ లో శనివారం నిర్మల్ ప్లస్ క్లబ్ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారు. ముందుగా కొత్త కార్యవర్గం చేత ప్రమాణ స్వీకారోత్సవాన్ని చేయించగా ఎన్నికైన అధ్యక్ష ప్రధాన కార్యదర్శులతో పాటు నూతన కమిటీ సభ్యులను వారు సన్మానం చేశారు.
నిర్మల్ జిల్లా రాజకీయ విద్యా చైతన్యానికి కేంద్ర బిందువుని ఈ జిల్లాలో ప్రజల సమస్యలను ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతిల దృష్టికి తీసుకురావడంలో పాత్రికేయులు ఎంతగానో కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా నిలిచి పాత్రికేరంగం ఎంతో విలువైందని నిర్మల్ పాత్రికేయులు ఆ విలువలను కాపాడుతూ ఈ ప్రాంత అభివృద్ధికి ప్రజలను చైతన్యం చేయవలసిన అవసరం ఉందని గుర్తు చేశారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా రాసం శ్రీధర్, ప్రధాన కార్యదర్శిగా డి లక్ష్మీనారాయణ, కోశాధికారిగా కోడూరు సందీప్ తో పాటు మొత్తం 21 మంది సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. కొత్త కారు వర్గానికి రాజకీయ పార్టీల నేతలతో పాటు ఉద్యోగ సంఘాల నాయకులు విద్యాసంస్థల నేతలు యువజన సంఘాల నాయకులు సన్మానం చేశారు.