calender_icon.png 25 June, 2025 | 2:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జర్నలిస్ట్ పిల్లలకు 50 శాతం ఫీజు రాయితీ

24-06-2025 04:38:17 PM

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పని చేస్తున్న జర్నలిస్టు పిల్లలకు ప్రైవేటు పాఠశాలల్లో 50% ఫీజు రాయితీ కల్పిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విద్యాశాఖ అధికారి ఎం వెంకటేశ్వర చారి(District Education Officer Venkateswara Chari) మంగళవారం జీవో విడుదల చేశారు. తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు(TUWJ -IJU) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యవర్గం విజ్ఞప్తి మేరకు ఈ జీవోను విడుదల చేశారు. ఈ కాపీని తీసుకున్న యూనియన్ జిల్లా అధ్యక్షులు ఉదయ్ కుమార్ కు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... జిల్లావ్యాప్తంగా జర్నలిస్టులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.