24-06-2025 04:38:17 PM
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పని చేస్తున్న జర్నలిస్టు పిల్లలకు ప్రైవేటు పాఠశాలల్లో 50% ఫీజు రాయితీ కల్పిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విద్యాశాఖ అధికారి ఎం వెంకటేశ్వర చారి(District Education Officer Venkateswara Chari) మంగళవారం జీవో విడుదల చేశారు. తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు(TUWJ -IJU) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యవర్గం విజ్ఞప్తి మేరకు ఈ జీవోను విడుదల చేశారు. ఈ కాపీని తీసుకున్న యూనియన్ జిల్లా అధ్యక్షులు ఉదయ్ కుమార్ కు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... జిల్లావ్యాప్తంగా జర్నలిస్టులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.