24-06-2025 03:29:22 PM
బెల్లంపల్లి అర్బన్,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీలో మహిళా సంఘాలకు బంపర్ ఆఫర్ వరించింది. బెల్లంపల్లి మున్సిపాలిటీలో చేపట్టిన100 రోజుల కార్యాచరణ కార్యక్రమంలో భాగంగా మంగళవారం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్- బెల్లంపల్లి బ్రాంచ్ 12 మహిళా సంఘాలకు రూ.1.50 (కోటి యాబై లక్షల) ఋణాలు మంజూరు చేసింది.
ఈ మేరకు కోటి యాభై లక్షల రుణం చెక్కును 12 మహిళా సంఘాల ఆర్ పీలు, మహిళలకీ అందజేశారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి మున్సిపల్ కమీషనర్ శ్రీనివాస్ రావు బ్రాంచ్ మేనేజర్ బుచ్చయ్య, ఫీల్డ్ ఆఫీసర్ శ్రావణ్, మెప్మా టీఎంసీ డి దుర్గయ్య, సి ఓ కిషోర్ ,మెప్మా ఆర్పీలు, ఆయా మహిళ సంఘాల సభ్యులు పాల్గొన్నారు.