calender_icon.png 24 June, 2025 | 9:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

12 మహిళా సంఘాలకు రూ.కోటి 50 లక్షల రుణం

24-06-2025 03:29:22 PM

బెల్లంపల్లి అర్బన్,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీలో మహిళా సంఘాలకు బంపర్ ఆఫర్ వరించింది. బెల్లంపల్లి మున్సిపాలిటీలో చేపట్టిన100 రోజుల కార్యాచరణ కార్యక్రమంలో భాగంగా మంగళవారం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్- బెల్లంపల్లి బ్రాంచ్ 12  మహిళా సంఘాలకు రూ.1.50 (కోటి యాబై లక్షల) ఋణాలు మంజూరు చేసింది.

ఈ మేరకు కోటి యాభై లక్షల రుణం చెక్కును 12 మహిళా సంఘాల ఆర్ పీలు, మహిళలకీ అందజేశారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి మున్సిపల్ కమీషనర్  శ్రీనివాస్ రావు బ్రాంచ్ మేనేజర్ బుచ్చయ్య, ఫీల్డ్ ఆఫీసర్ శ్రావణ్, మెప్మా టీఎంసీ డి దుర్గయ్య, సి ఓ కిషోర్ ,మెప్మా ఆర్పీలు, ఆయా మహిళ సంఘాల సభ్యులు పాల్గొన్నారు.