calender_icon.png 7 June, 2025 | 6:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న జర్నలిస్టుల పిల్లలకు 50 శాతం ఫీజు రాయితీ

05-06-2025 09:14:39 PM

ప్రొసీడింగ్ జారీ చేసిన జిల్లా విద్యాశాఖాధికారి..

కృతజ్ఞతలు తెలిపిన గార్లపాటి కృష్ణారెడ్డి..

నల్లగొండ టౌన్ (విజయక్రాంతి): ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న జర్నలిస్టుల పిల్లలకు 50 ఫీజు రాయితీ ప్రొసీడింగ్ ను జిల్లా విద్యాధికారి బొల్లారం బిక్షపతి(District Education Officer Bollaram Bikshapathi) గురువారం జారీ చేశారు. కేయూడబ్ల్యూజే (ఐజేయు) జిల్లా అధ్యక్షుడు గార్లపాటి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న జర్నలిస్టుల పిల్లలకు 50 శాతం ఫీజు రాయితీ ఇవ్వాలని కోరుతూ డీఈవో బొల్లారం బిక్షపతికి బుధవారం వినతి పత్రం సమర్పించారు. వెంటనే స్పందించి జిల్లా విద్యాధికారి ప్రొసీడింగ్ ను జారీ చేసిన సందర్భంగా గార్లపాటి కృష్ణారెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ సందర్భంగా గార్లపాటి కృష్ణారెడ్డి మాట్లాడుతూ... జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా సంస్థల్లో పనిచేస్తున్న జర్నలిస్టుల పిల్లలకు 50 శాతం ఫీజు రాయితీ కల్పిస్తూ డీఈవో ఉత్తర్వులు జారీ చేయడం సంతోషకరం అన్నారు. దీనికి స్పందించిన డిఇఓ,అర్హులైన జర్నలిస్టుల పిల్లలకు అందించడానికి అన్ని ప్రైవేట్ పాఠశాలల్లో 50 శాతం రాయితీని జర్నలిస్టులు సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.

ఏదైనా పాఠశాల యాజమాన్యం వినకపోతే,దానిని తన దృష్టికి తీసుకురావాలని ఆయన చెప్పారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కొరకు టియుడబ్ల్యూజే ( ఐజేయు) నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కె నాగయ్య, మాధురి యాదగిరి, ఏరెట్ల చంద్రశేఖర్ రెడ్డి, వంగాల శ్రీనివాసరెడ్డి, దోటి శ్రీనివాస్, జిల్లా యాదయ్య, సుధాకర్, అంజయ్య, దశరథ, సమద్, వెంకటేశ్వర్లు, అశోక్, రామకృష్ణ, జజాల కృష్ణ, రాంప్రసాద్, సత్యం, సోమ చంద్రశేఖర్, రాంప్రసాద్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.