05-06-2025 08:52:06 PM
నిర్మల్ (విజయక్రాంతి): పట్టణానికి చిన్న మీడియా అధ్యక్షుడు అఖిల్ రెబల్ మాతృమూర్తి అనారోగ్యంతో చికిత్స పొంది ఇంటికి వచ్చిన విషయం తెలుసుకున్న మాజీమంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి(Former Minister Allola Indrakaran Reddy) ఇంటికి వచ్చి పరామర్శించారు. అనారోగ్యానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. తొందరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని అన్నారు. మంత్రితో పీవీ రమణ రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్, రాజు, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శ్రీకాంత్ యాదవ్, రవి, తదితరులు ఉన్నారు.