‘అగ్నివీర్’లుగా ఎంపికైన యువకులకు సన్మానం
ముకరంపుర, జూన్ 7 (విజయక్రాంతి): ‘ఫిట్నెస్ ఫ్రీక్స్’ ఆధ్వర్యంలో భారత సైన్యంలో ’అగ్నివీర్’లుగా ఎంపికైన కరీంనగర్ యువకులను సన్మానించారు .ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, కరీంనగర్ నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు ముఖ్య అతిథిగా హాజరై దేశ రక్షణ కోసం సైన్యంలో అడుగుపెడుతున్న యువకులను మరియు ప్రోత్సహించిన వారి తల్లిదండ్రులను ఈ సందర్భంగా ఆయన ప్రత్యేకంగా అభినందించారు.
అనంతరం అగ్నివీరులుగా ఎంపికైన యువకులను శాలువాలతో ఘనంగా సన్మానించి, వారికి జ్ఞాపికలను అందజేశారు. యువత క్రమశిక్షణతో అంకితభావంతో దేశ సేవలో భాగస్వామ్యం కావడం కరీంనగర్ ప్రాంతానికే గర్వకారణమని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు,ఫిట్నెస్ ఫ్రీక్స్ నిర్వాహకులు సురేష్ ఎంపికైన యువకుల తల్లిదండ్రులు,స్థానిక యువకులు మరియు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.






