ఫర్టిలైజర్ షాపుల బంద్ విజయవంతం
చేగుంట ఏప్రిల్ 27: ఉత్పత్తిదారుల విధానాలను నిరసిస్తూ రాష్ట్ర ఫర్టిలైజర్స్ డీలర్ అసోసియేషన్ పిలుపు మేరకు చేగుంట లో మండల పెర్టీలైజర్ డీలర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎరువుల సరఫరాపై ఎఫ్,పి,ఎల్ విధానాన్ని అమలు చేయాలని, లింక్ ప్రొడక్ట్ లేకుండా ఎరువులు అందించాలని, డీలర్లపై ఎరువులు, పురుగు మందుల స్టాక్ పాయింట్ నుండి తీసుకురావడానికి రవాణా ఖర్చులు డీలర్ల పై వేయడంతో, దానిని నిరసిస్తూ చేగుంట మండలంలోని పురుగుల మందు, ఎరువుల దుకాణ యజమానులు సోమవారం పట్టణ కేంద్రం లో షాపులు బంద్ చేశారు.
ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ రాష్ట్ర అసోసియేషన్ పిలుపు మేరకు, ఎరువులు, ఫెర్టిలైజర్ షాపుల బంద్ నిర్వహించామని,కంపెనీలు ఎరువులు, పురుగు మందుల విషయంలో ఏదో ఒక లింకు పెట్టడాన్ని స్వస్తి పలకాలని, కంపెనీ లు అవలంబిస్తున్న విధానం తో రైతులపై అధిక భారం పడుతుందని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో డీలర్లు మెదక్ రాములు, మిర్పకాయ వెంకటేషం, శ్రీకాంత్ యాదవ్, గంప రాజు, యట బాలకృష్ణ, గంప రాజు, ప్రశాంత్, గంగాధర్, బోయిని స్వామి, మహేష్, ఉప్పాల వెంకటేష్, నాగరాజు, రవి, రాజు, ప్రశాంత్, రాకేష్, రాజులింగం, సంజీవ్, అవినాష్, మధు, శ్రీనివాస్,తదితరులు పాల్గొన్నారు.






