02-06-2025 01:15:12 AM
ఎల్లారెడ్డి, జూన్ 1 (విజయ క్రాంతి) పండుగలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఎల్లారెడ్డి సిఐ రవీందర్ తెలిపారు. ఆదివారం రాత్రి కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట పోలీస్ స్టేషన్లో వివిధ మతాల చెందిన వారితో బక్రీద్ పండుగ సందర్భంగా నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు.
అన్ని మతాల వారికి పండుగలు ఉంటాయని ఆ పండుగలను ప్రశాంత వాతావరణంలో కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకోవాలని సూచించారు. సమావేశంలో నాగిరెడ్డిపేట ఎస్త్స్ర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.