calender_icon.png 3 June, 2025 | 5:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేంద్ర మంత్రి సమక్షంలో బీజేపీలో చేరిక

02-06-2025 01:16:16 AM

కడ్తాల్, జూన్ 1 : భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి అధ్వర్యంలో మాజీ బీసీ కమిషన్ సభ్యులు  తల్లోజు ఆచారి సమక్షంలో కడ్తాల్ మండలం చిన్న వేమూలోనిబాయితండాకి చెంది నటువంటి శ్రీనిధి పౌండేషన్ అధ్యక్షులు, వ్యాపారావేత దేపావత్. రవి నాయక్ గారు వారితోపాటు దేపవత్ వినోద్ నాయక్,దేపవత్ అఖిల్ నాయక్ గిరిజన మహిళలు ఆదివారం  భారతీయ జనతా పార్టీలో చేరారు.

దేపావత్ రవి నాయక్ మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ చేపడుతున్నటువంటి  సంక్షేమ పథకాలు దేశ రక్షణ దేశాభివృద్ధి  ఆకర్షితుడనై  బిజెపి పార్టీలో చేరడం జరిగిందని, తెలంగాణ రాష్ట్రం కల్వకుర్తి నియోజకవర్గంలో పార్టీ ఎదుగుదలకు ఆచారి గెలుపుకై తన వంతు కృషి చేస్తానని అన్నారు. 

ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు వేముల నరేంద్ర రావు , కడ్తాల్ మండల బిజెపి అధ్యక్షులు దోనాదుల మహేష్, ఎస్టీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు బాణావత్ సాయిలాల్ నాయక్, బాణావత్ శంకర్ నాయక్, కేతావత్ రెడ్యానాయక్, కొన్సిల్ సభ్యులు మాలె శ్రీశైలం గౌడ్, నిగ్యారి యాదగిరి, సభవత్ రాందాస్,, షిద్దిగారి కుమార్, తుప్పరి శ్రీను, సంతోజు విక్రాంత్,పొగాకు వెంకటేష్ గౌడ్,జరుపుల లక్షమన్, నాయుక్, జంగయ్య తదితరులు పాల్గొన్నారు.