02-06-2025 01:14:06 AM
ప్రతాపసింగారంలో రోడ్డుపై ఆందోళన చేసిన స్థానికులు
మద్దతు పలికిన బీఆర్ఎస్, బీజేపీ నాయకులు
ఘట్ కేసర్ జూన్ 1 (విజయక్రాంతి) : ఘట్కేసర్ మండలం ప్రతాప సింగారంలో అనర్హులకు డబుల్ బెడ్ రూం ఇళ్ళు కేటాయించారని ఆరోపిస్తూ స్థానిక మహిళలు ఆందోళన చేపట్టారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.ఈసందర్భంగా మహిళలు మాట్లాడుతూ 90 కుటుంబాల డబుల్ బెడ్ రూం ఇళ్ల లబ్ధిదారుల లిస్టును మేడ్చల్ కలెక్టర్ కార్యాలయం నుండి ప్రతిపాదించడం జరిగిందని తెలిపారు.
90 కుటుంబాల లిస్టులో 30 కుటుంబాలు మాత్రమే ఇళ్లు లేని పేదలు, మిగిలిన 60 ఇల్లు ఉన్న కాంగ్రెస్ పార్టీ కి చెందిన కార్యకర్తల పేర్లు ఉన్నాయని ఆరోపించారు. ఎలాంటి విచారణ లేకుండా లిస్టు తయారు చేశారని, జూన్ రెండోవ తేదీన ఈ లిస్టు లో ఉన్నవారికి ఇవ్వనునట్లు తెలుస్తుందని మహిళలు ఆం దోళన చేపట్టారు.
తక్షణమే ఈ 90 పేర్ల లిస్టును రద్దు చేసి, ఇల్లు లేని పేదలను గు ర్తించి, పూర్తి విచారణ ద్వారా పేద లకు లబ్ది చేకూర్చాలని నిరసన వ్యక్తం చేశారు. ఈనిరసన కార్యక్రమంలో ప్రతా పసింగారంకి చెందిన మహిళలు, మద్దతుగా బీఆర్ఎస్ నాయకులు, బీజేపీ, బిజెవైఎం నాయకులు తగితరులు పాల్గొన్నారు.