4 April, 2026 | 1:56 PM

Breaking News

ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం— చైర్మన్‌గా టేకుల సుదర్శన్ రెడ్డి   •   ప్రభుత్వ పాఠశాలలోనే విద్యార్థులను చేర్పించాలి   •   బడికి డుమ్మా కొడుతున్న టీచర్లు — పిల్లల చదువుకు ఎగనామం   •   జీవన్ రెడ్డి వ్యాఖ్యలపై సత్తు మల్లేశం ఆగ్రహం   •   బీఆర్ఎస్ పార్టీ నీచ బుద్ధి వీడాలి   •   హాస్పిటల్ ఇన్ఫెక్షన్ల నివారణపై అవగాహన కార్యక్రమం   •   క్యాతనపల్లి చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు పటిష్ఠ బందోబస్తు   •   నాటు సారా తాగి ముగ్గురు మృతి — సారా వల్లే మరణించారా ?   •   పురుగుమందు డబ్బాలతో రైతుల ఆందోళన   •   పెద్దపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. సింగరేణి ఉద్యోగి మృతి, ముగ్గురికి గాయాలు   •  

గాంధీ పేరును కొనసాగించే వరకు పోరాటం

13-02-2026 12:00 AM

మాజీ రాజ్యసభ సభ్యులు వి. హనుమంతరావు

ముషీరాబాద్, ఫిబ్రవరి12  (విజయక్రాంతి): మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో యధావిధిగా మహాత్మా గాంధీ పేరు ను కొనసాగించే వరకు పోరాటం చేస్తామని మాజీ ఎంపీ వి. హనుమంతరావు అన్నారు. ఈ మేరకు గురువారం అంబర్ పేట నియోజకవర్గం నల్లకుంట ఫీవర్ హాస్పిటల్ చౌరస్తాలో జాతీయ ఉపాధి హామీ పథకంలో మహాత్మా గాంధీ పేరును తొలగించడానికి నిరసిస్తూ మాజీ పీసిసి కార్యదర్శి లక్పతి జ్యోతి యాదగిరి గౌడ్ ఆధ్వర్యంలో  సత్యాగ్రహ దీక్షను చేపట్టారు. ఈ దీక్షకు హనుమంతరావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

కేంద్ర ప్రభు త్వం వెంటనే తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని లేనిపక్షంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయ కులు మాజీ పీసిసి కార్యదర్శి ఆర్. లక్ష్మణ్ యాదవ్, మాజీ కార్పొరేటర్ నారాయణస్వా మి, ఖైరతాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి తొలుపునూరి కృష్ణ గౌడ్, శంభుల శ్రీకాంత్ గౌడ్, అనిల్ పాల్గొన్నారు.