13-12-2025 12:00:00 AM
నిజామాబాద్, డిసెంబర్ 12 (విజయ క్రాంతి): గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా రెండవ విడతలో ఎన్నికలు జరిగే మండలాల పోలింగ్ సిబ్బంది తుది ర్యాండమైజేషన్ ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి, జనరల్ అబ్జర్వర్ శ్యాంప్రసాద్ లాల్ సమక్షంలో శుక్రవారం నిర్వహించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఎన్.ఐ.సీ హాల్ లో ఎన్నికల సంఘం నిబంధనలను అనుసరిస్తూ ర్యాండమైజేషన్ జరిపించారు.
ఈ ప్రక్రియను కలెక్టర్, అబ్జర్వర్ నిశితంగా పరిశీలించారు. ఏకగ్రీవం అయిన వాటిని మినహాయిస్తూ, ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్న మిగిలిన గ్రామ పంచాయతీలకు సంబంధించి ఒక్కో మండలం వారీగా ఆయా గ్రామ పంచాయతీల సర్పంచ్, వార్డు స్థానాలకు ఎన్నికల పోలింగ్ విధులు నిర్వర్తించే ప్రిసైడింగ్ అధికారులు, ఓ.పీ.ఓలను ర్యాండమైజేషన్ ద్వారా పోలింగ్ కేంద్రాలకు కేటాయించారు. ఈ ప్రక్రియలో నోడల్ అధికారి పవన్ కుమార్, జిల్లా పంచాయతీ కార్యాలయం ఏ.ఓ రాజబాబు తదితరులు పాల్గొన్నారు.