calender_icon.png 10 September, 2025 | 12:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

10న జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల తుది ఓటరు జాబితా

09-09-2025 12:18:32 AM

ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 08: రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల తుది ఓటరు జాబితాను ఈ నెల 10న వెలువరించడం జరుగుతుందని ఇంచార్జ్ జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) కె. శ్రీనివాస్ తెలిపారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో ఇంచార్జ్ జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) కె. శ్రీనివాస్ అధ్యక్షతన గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా ఇప్పటికే ముసాయిదా ఓటరు జాబితా విడుదల చేయడం జరిగిందని అన్నారు. ముసాయిదా జాబితా, పోలింగ్ కేంద్రాలకు సంబంధించి ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని సూచించారు. వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి, అవసరమైన మార్పులు చేర్పులు జరిపిన మీదట సెప్టెంబర్ 10వ తుది జాబితా వెలువరిస్తామని సూచించారు.

మండల స్థాయిలో నిర్వహించిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశంలో కూడా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని కోరడం జరిగిందన్నారు. తుది ఓటరు జాబితా రూపకల్పనకు రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో  జెడ్పీ సీఈఓ కృష్ణారెడ్డి, డిప్యూటీ సీ.ఈ.ఓ రంగరావు, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుండి ఎన్. మహేష్, ఆవుల యాదయ్య, కె.రాజ్ కుమార్, బిఆర్‌ఎస్ నుండి వనం శ్రీనివాస్, బిజెపి నుండి కె.అనం తయ్య గౌడ్, అంబాజీ శ్రీనివాస్, సిపిఐ(యం) నుండి పగడాల యాదయ్య, సిపిఐ  నుండి పాలమాకుల జంగయ్య, పానుగంటి పర్వతాలు, టిడిపి నుండి జె. రవీందర్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.