8 June, 2026 | 9:51 PM

Breaking News

ఇంటర్‌లింక్ లైన్ వ్యవస్థతో నిరంతరాయ విద్యుత్ సరఫరా   •   ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా యూపీహెచ్సి రామవరం లో అవగాహన కార్యక్రమం   •   ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు కార్యశాల   •   పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్ బదిలీ   •   సునంద రైస్ ఇండస్ట్రీ ట్రెండ్ లైసెన్స్ ను వెంటనే రద్దు చేయాలి   •   బదిలీపై వెళ్లిన పంచాయతీ కార్యదర్శికి సన్మానం చేసిన గ్రామస్తులు   •   ప్రతి కార్యకర్త సమన్వయంతో పనిచేయాలి   •   పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో ప్రజలపై పెను భారం మోపుతున్న మోదీ సర్కార్   •   పరిసరాల పరిశుభ్రత పర్యావరణ పరిరక్షణకు ప్రజలు సహకరించాలి   •   చింతకుంటలో కేత్ బచావో- భూమి సంరక్షణ కార్యక్రమం   •  

ఎట్టకేలకు గెలుపు రుచి

19-10-2024 12:00 AM

ముల్తాన్: సొంతగడ్డపై పాకిస్తాన్ ఎట్టకేలకు గెలుపు రుచి చూసింది. శుక్రవారం ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టులో పాక్ 152 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఫలితంగా తొలి టెస్టు ఓటమికి  ప్రతీకారం తీర్చుకున్న పాక్ సిరీస్‌ను 1 సమం చేసింది. 296 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 144 పరుగులకే కుప్పకూలింది.

కెప్టెన్ స్టోక్స్ (37) టాప్ స్కోరర్. నోమన్ అలీ 8 వికెట్లు పడగొట్టాడు. రెండు ఇన్నింగ్స్‌లు కలిపి 9 వికెట్లు పడగొట్టిన సాజిద్ ఖాన్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. చివరిదైన మూడో టెస్టు ఈ నెల 24 నుంచి మొదలుకానుంది. ఇంగ్లండ్‌పై విజయంతో పాకిస్థాన్ సొంత గడ్డపై 1350 రోజుల తర్వాత టెస్టు మ్యాచ్‌లో నెగ్గడం విశేషం.

చివరిగా  2021లో దక్షిణాఫ్రికాపై గెలుపు రుచి చూసిన పాకిస్థాన్ అప్పటి నుంచి స్వదేశంలో ఒక్క మ్యాచ్ కూడా గెలవలేక పోయింది. అంతేకాదు 11 వరుస పరాజయాల పరంపరకు ముగింపు పలికింది. ఇంగ్లండ్‌పై విజయంతో పాకిస్థాన్ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) పాయింట్ల పట్టికలో ఒక స్థానం ఎగబాకింది. ఇక టీమిండియా (74.24 శాతం) తొలి స్థానంలో ఉంది.