02-02-2026 04:54:55 PM
మఠంపల్లి: మఠంపల్లి మండలంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకు పెదవీడు శాఖ ఆధ్వర్యంలో మట్టపల్లి గ్రామపంచాయతీ వద్ద ఆర్థిక సాంకేతిక అక్షరాస్యత అవగాహన కార్యక్రమం బ్యాంకు మేనేజర్ ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ రామిశెట్టి విజయశాంతి అప్పారావు సమక్షంలో మహిళా సంఘాలు రైతులు ప్రజలు ఉద్దేశించి బ్యాంకు మేనేజర్ బి.మహేష్ మాట్లాడుతూ... ప్రధానమంత్రి జీవనజ్యోతి భీమా, ప్రధానమంత్రి సురక్ష భీమా, ఎస్బిఐ జనరల్ ఇన్సూరెన్స్, పిఎమ్ ఆటల్ పింఛన్ వీటితో పాటు సైబర్ నేరాల్లో ప్రజలందరూ అప్రమత్తమై ఉండాలి. ఒకవేళ మన ఖాతాలో డబ్బులు పోతే 1930 కు గంట లోపల ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని, పోయిన డబ్బులు సైబర్ నేరాల్లో పోయిన తిరిగి రప్పించవచ్చని ప్రజలకు తెలియాజేశారు. ఈ కార్యక్రమంలో సి ఎస్ పి,వివోఏ మహిళలు తదితరులు పాల్గొన్నారు.