02-02-2026 05:00:49 PM
వాంకిడి (విజయక్రాంతి): స్థానిక మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయని కళాశాల చీఫ్ సూపరింటెండెంట్ ఎం. చంద్రయ్య తెలిపారు. ఈ నెల 11వ తేదీ వరకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. కస్తూర్బా గాంధీ బాలికల జూనియర్ కళాశాల విద్యార్థులు వాంకిడి ప్రభుత్వ జూనియర్ కళాశాల సెంటర్లో ప్రాక్టికల్ పరీక్షలకు హాజరయ్యారు.
సోమవారం ఉదయం ఒకేషనల్ మొదటి సంవత్సరం విద్యార్థులు 36 మంది పరీక్షలు రాయగా, మధ్యాహ్నం ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 27 మంది ప్రాక్టికల్ పరీక్షలకు హాజరయ్యారు. మొత్తం 63 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరైనట్లు తెలిపారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల వాంకిడి ప్రాక్టికల్ పరీక్షల కేంద్రాన్ని డీఐఈఓ బి. రాందాస్, డీఐసీ మెంబర్ అనిల్ కుమార్ సందర్శించి, పరీక్షలు సజావుగా నిర్వహించబడుతున్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు.