04-05-2025 07:57:13 PM
బైంసా (విజయక్రాంతి): కుబీర్ మండలంలోని రూడర్నా గ్రామనికి చెందిన సాయిలు ఇటీవలే అనారోగ్యంతో మృతిచెందగా కుటుంబ సభ్యులకు వారి మిత్రులు ఆదివారం 14 వేల రూపాయల ఆర్థిక సాయాన్ని అందించారు. సాయిలుకు ఇద్దరు చిన్నపిల్లలు ఉండడంతో వారి చదువుకు ప్రోత్సహిస్తామని స్నేహితులు తెలిపారు.