27 July, 2026 | 7:09 AM

జీడిమెట్లలో అగ్ని ప్రమాదం.. అదుపులోకి రాని మంటలు

27-11-2024 10:01 AM

హైదరాబాద్: మేడ్చల్‌ జిల్లా జీడిమెట్ల పారిశ్రామికవాడలోని ఎస్‌ఎస్‌వీ ఫ్యాబ్‌ ఫ్యాక్టరీ, పాలిథిన్‌ బ్యాగ్‌ల తయారీ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మంగళవారం మధ్యాహ్నం ప్రారంభమైన మంటలను అగ్నిమాపక బృందాలు ఎడతెగని ప్రయత్నాలు చేసినప్పటికీ అదుపులోకి రాలేదు. కింది అంతస్తులో పెద్దమొత్తంలో ప్లాస్టిక్ ముడి పదార్థం ఉండటం పరిస్థితిని మరింత తీవ్రతరం చేసింది. అగ్నిమాపక సిబ్బంది, నాలుగు ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను ఆర్పుతున్నారు. బుధవారం మధ్యాహ్నం వరకు మంటలను అదుపులోకి తీసుకురావాలని భావిస్తున్నారు. ఈ ఘటనలో భవనం పూర్తిగా దగ్ధమై కూలిపోయింది. దట్టమైన పొగ, మంటలు వ్యాపించడంతో పరిసర ప్రాంత వాసులలో భయాందోళనకు గురయ్యారు. పక్కనే ఉన్న ఫ్యాక్టరీలకు మంటలు చేరకుండా అగ్నిమాపక సిబ్బంది శ్రమిస్తున్నారు.