27 July, 2026 | 6:58 PM

Breaking News

దొంగతనానికి పాల్పడ్డ వ్యక్తి అరెస్ట్   •   పైతర పంచాయతీ కార్మికులకు ప్రమాద బీమా పత్రాల పంపిణీ   •   సర్ ప్రక్రియను పరిశీలించిన జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు   •   విద్యాబోధనలో నూతన విధానాలను అమలు చేయాలి   •   యూనియన్ బ్యాంకులో తెలుగు తెలిసిన సిబ్బందిని నియమించాలి   •   ఎల్ నినోను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారికి నిత్య కళ్యాణం   •   గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనాన్ని అమలు చేయాలి: జడ శ్రీనివాస్   •   డబుల్ బెడ్‌రూం ఇళ్ల సమస్యలపై కలెక్టర్‌కు సీపీఎం వినతి   •   ఎల్ నినో దృష్య వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలి   •  

ఉక్కు కర్మాగారంలో అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు

02-06-2026 12:57 PM

రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లోని(Chhattisgarh) రాయ్‌పూర్ జిల్లాలో ఉన్న ఒక ఉక్కు తయారీ(Steel Plant) కర్మాగారం క్యాప్టివ్ విద్యుత్ కేంద్ర విభాగంలో మంగళవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం సంభవించిందని పోలీసులు తెలిపారు. మందిర్ హసౌద్ పోలీస్ స్టేషన్(Mandir Hasaud Police Station ) పరిధిలోని 'మివాన్ స్టీల్' ప్లాంట్‌లో చెలరేగిన అగ్నిప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు. ఆ మంటల నుండి దట్టమైన పొగ మేఘాల్లా ఆకాశంలోకి ఎగసిపడిందని, అది కిలోమీటర్ల దూరం నుండే కనిపించిందని స్థానికులు తెలిపారు.