20-08-2025 12:56:43 PM
మహదేవపూర్/భూపాలపల్లి (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా(Jayashankar Bhupalpally District) మహాదేవపూర్ మండలం కాలేశ్వరంలో గోదావరి నది(Godavari River) ఉధృతంగా ప్రవహిస్తూ మెట్లు దాటి ప్రవహించడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. మేడిగడ్డ(లక్ష్మి) బ్యారేజ్ వద్ద 9 లక్షల 90 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహం రాగా మేడిగడ్డ బ్యారేజ్ 85 గేట్లు ఎత్తి అంతే మొత్తం నీటిని దిగువకు వదులుతున్నారు. గోదావరి ఉధృతంగా ప్రవహిస్తున్నందున లోతట్టు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు.