20-08-2025 02:44:42 PM
ఖానాపూర్ (విజయక్రాంతి): భారత మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ(Rajiv Gandhi) ఆశయాలను నెరవేర్చాలని మాజీ మున్సిపల్ చైర్మన్లు రాజుర సత్యం, అంకం రాజేందర్ లు అన్నారు. బుధవారం రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు ఖానాపూర్ మార్కెట్ యార్డ్ రాజీవ్ చౌక్ లో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా జరిపారు. ఈ కార్యక్రమంలో రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ తోట సత్యం, మైనార్టీ సెల్ టౌన్ ప్రెసిడెంట్ శౌకత్ పాషా, నాయకులు అమానుల్లా ,రాజేశ్వరి , మీర్జా, షారుఖాన్ , శంకర్, లోకిని జూనీ నయీం భాయ్, జహీరుద్దీన్, రాజేందర్, అయూబ్ ,తదితరులు పాల్గొన్నారు.