29-05-2025 02:42:12 AM
10న జరిగే ధర్నాను జయప్రదం చేయండి
పెబ్బేరు మే 28: మండల కేంద్రంలో మత్స్య సహకార సంఘం లో బుధవారం మత్స్య కార్మిక సంఘం జిల్లా కమిటీ సమావేశంఅధ్యక్షుడు జి బాలయ్య అధ్యక్షతన జరిగింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వము మత్స్యకారులకు చేప పిల్లలు ఇచ్చేది. నాటి చేప పిల్లలు నాణ్యతమైనవి కాకుండా ఉండడం వలన చేప పెరగకపోవడం వలన ప్రతి మత్స్యకార సొసైటీ మత్స్యకారులు లక్షల రూపాయలు నష్టపోయారు.
అంతేకాకుండా ప్రభుత్వం కేటాయించిన కోట్ల రూపాయలు మధ్య దళారీ టెండర్ల మూలంగా ప్రభుత్వ ఖజానాకు గండి పడింది. కాబట్టి ఇప్పటి ప్రభుత్వం ప్రతి మత్స్య సహకార సంఘాలకు,చేప పిల్లల బదులు ప్రతి మత్స్య సొసైటీకి పది లక్షల రూపాయలకు తగ్గకుండా నగదు బదిలీ చేయాలని మరియు ఇతర వృత్తిదారుల మాదిరిగానే 50 సంవత్సరాలు నిండిన ప్రతి మత్స్య కారులు మరియు మత్స్య కార్మికునికి నెలకు 5000 రూపాయల పెన్షన్ సౌకర్యం కల్పించాలి , భూమిలేని మత్స్యకారులకు మత్సబంధువు కింద ఎకరాకు 15 వేల రూపాయల చొప్పున ఇవ్వాలి, మత్స్యకారులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని, మత్స్య కారులు మత్స్య కార్మికులు చనిపోతే మత్స్య బీమా పథకం కింద 10 లక్షల రూపాయలు ఇవ్వాలని మరియు జిల్లాలో ఉన్న చెరువులు, కుంటల సిక్కెం భూములతో సహా ధనికులు కబ్జాలకు గురి చేస్తున్నారని విమర్శించారు.
ప్రతి చెరువు ను రీస్ సర్వే చేసి హద్దులు ఏర్పరచాలని మరియు స్థానిక మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సంఘం ఆధ్వర్యంలో జూన్ 10న వనపర్తి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా గౌరవాధ్యక్షులు ఆంజనేయులు, ఉపాధ్యక్షులుఆర్. నిరంజన్, సహాయ కార్యదర్శి జి. మహేష్ జిల్లా కమిటీ సభ్యులు కురుమూర్తి కే ఆనంద్, నారాయణ, రాముడు, మద్దమ్మ పాల్గొన్నారు.