29-05-2025 02:44:42 AM
- రాష్ట్రం మొత్తం పాదయాత్ర చేస్తాం బీసీ లను ఐక్యత చేస్తాం
- బీసీ పొలిటికల్ జె ఏ సి రాష్ట్ర చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్
వనపర్తి, మే 28 ( విజయక్రాంతి ) : రాష్ట్రములో అన్ని ఓట్లు మనవే సీట్లు కూడా మనవే కావాలని అదే నినాదం గా అందరు కలిసి కట్టుగా ముందుకు సాగాలని బీసీ పొలిటికల్ జె ఏ సి రాష్ట్ర చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ అన్నారు.
బుధవారం జిల్లా కేంద్రం లోని పాలిటెక్నీక్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బీసీ జనభేరి కార్యక్రమం కు రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులతో కలిసి ఆయన ముఖ్య అతిధిగా హాజరు అయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు..... ప్రజా సమస్య ల పరిష్కారం కోసం అటు అధికారులు ఇటు ప్రభుత్వం తో గత రెండు దశబ్దాలుగా ఉద్యమం చేస్తున్నామని, వనపర్తి జిల్లాలో ప్రతి సమస్య పై పోరాటం చేస్తున్నది బీసీ పొలిటికల్ జె ఏ సి మాత్రమే పోరాటం చేస్తుందని చాలా సమస్య లు పరిష్కారం కావడం తో పాటు పలువురు జిల్లా అధికారులు సైతం సస్పెండ్ కావడం జరిగిందని ఆయన గుర్తు చేశారు.
గత నెలలో వనపర్తి జిల్లా మొత్తం పాదయాత్ర చేసిన సమయంలో చాలా సమస్య లను ప్రజలు తమ దృష్టికి రావడం జరిగిందని వాటన్నింటినీ ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్లి పరిష్కారం అయ్యే వరకు పోరాటం చేస్తామన్నారు.
బీసీ లలో కులాలు ఎక్కువ అయ్యాయి బీసీ వాదం తక్కువ అయ్యిందని బీసీ లలో ఐక్యత రావాలని అందుకోసం భవిష్యత్ లో రాష్ట్రము మొత్తం తిరిగి బీసీలలో ఐక్యత తీసుకుని వస్తామని రేపు జరుగబోయే ప్రతి ఎన్నికలో బీసీ నాయకులను గెలిపించుకోవాలని అప్పుడే బీసీ లకు రాజ్యాధికారం వస్తుందన్నారు.
ఉమ్మడి పాలమూర్ జిల్లాకు చెందిన బిడ్డ సి ఎం అవుతారని ప్రజలందరూ వెంట ఉండి గెలిపించి సి ఎం చేయడం జరిగింది. ప్రభుత్వం ఏర్పాటు అయిన తరువాత ఉమ్మడి పాలమూర్ జిల్లాలో నామినేటెడ్ పోస్టులన్ని అగ్రవర్ణాల కు ఇచ్చారే తప్ప ఒక్క బీసీ నాయకుడికి ఇవ్వలేదు బీసీ లు కనిపించడం లేదా అని ఆయన సి ఎం ను సూటిగా ప్రశ్నించారు.
జనభేరి సభ నుండి 100 డిమాండ్ల ను ప్రభుత్వం దృష్టికి తీసుకుని వస్తున్నామని అవి పరిష్కారం అయ్యే వరకు పోరాటం చేస్తూనే ఉంటామన్నారు. ఈ సమావేశంలో ఆయా మండలాల, పట్టణ అధ్యక్షులు, నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.