calender_icon.png 15 June, 2025 | 11:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యశోద హాస్పిటల్స్ వారి కార్డియాలజీ సదస్సు

15-06-2025 12:35:51 AM

గుండె జబ్బుల అత్యాధునిక చికిత్సా విధానాలపై వర్క్‌షాప్ 

హైదరాబాద్ సిటీ బ్యూరో, జూన్ 14 (విజయక్రాంతి): యశోద హాస్పిటల్స్, క్లినికల్ కార్డియాలజీలో గుండె జబ్బుల చికిత్సలో వచ్చిన అధునాతన వైద్య విధానాలు, ‘అడ్వా న్స్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ’పై రెండు రోజుల పాటు జరిగే అంతర్జాతీయ సదస్సు, లైవ్ వర్క్ షాప్‌ను శనివారం యశోద గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జిఎస్ రావు, ఇంటర్నేషనల్ కార్డియాలజిస్టులతో కలిసి -హైటెక్ సిటీ యశోద హాస్పి టల్స్‌లో ప్రారంభించారు.

14, 15 తేదీల్లో జరిగే ఈ కార్యక్రమానికి ప్రపంచ నలుమూలల నుంచి సుమారు 500మందికి పైగా కార్డియాలజీ వైద్యులు పాల్గొన్నా రు. ఈ సందర్భంగా జిఎస్ రావు మాట్లాడుతూ.. “మన దేశంలో కార్డియో-వాస్కులర్ వ్యాధు లు రోజురోజుకు పెరుగుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా కార్డియోవాస్కులర్ డిసీజ్ (సీవీడీ) యొక్క అత్యధిక భారం ఉన్న దేశా ల్లో భారతదేశం ఒకటి. భారతదేశంలో సీవీడీ నుంచి వార్షిక మరణాల సంఖ్య 2.26 మిలియన్ల (1990) నుంచి 4.77 మిలియన్లకు (2020) పెరిగిందని అంచనా వేయబడింది.

వైద్య నిపుణులచే బోధించబడే అత్యాధునిక ఇన్స్టిట్యూట్స్ లో ఒకటిగా ఉన్న యశోద హాస్పిటల్స్ ప్రపంచస్థాయి వైద్య విధానాలను అందించడంలో మరి యు శిక్షణా కార్యక్రమాలను క్రమం తప్పకుండా నిర్వహిస్తుంది” అని చెప్పారు. యశో ద హాస్పిటల్స్- హైటెక్ సిటీ సీనియర్ కార్డియాలజిస్ట్, ఎలక్ట్రోఫిజియాలజిస్ట్ డాక్టర్ వీ.రాజశేఖర్ మాట్లాడుతూ...

యశోద హాస్పిటల్స్ ఈ రెం డు రోజుల అంతర్జాతీయ సమావేశం ‘అడ్వానస్డ్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ’లో భాగం గా ఇక్కడి కార్దియలజిస్ట్ లకు ఉన్నతస్థాయి శిక్షణ ఇచ్చేందుకుగాను యశోద హాస్పిటల్స్-హైటెక్ సిటీ లోని ఇంట్రవెన్షనల్ కార్దియల జీ విభాగం దీనిని ఏర్పాటుచేసిందన్నారు. ఈ సదస్సు లో జాతీయ మరియు అంతర్జాతీయ ప్రధాన కార్దియలజిస్ట్ లు కార్దియలజీ వైద్య రంగంలో అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక వైద్య విజ్ఞానం మరియు చికిత్సా విధానాలను వారు వివరించారు.