15 June, 2026 | 3:04 PM

Breaking News

తెలంగాణపై కేంద్రం తీవ్రమైన వివక్ష.. కిషన్ రెడ్డిపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు   •   పెద్దపల్లిలో కాంగ్రెస్ బూత్ లెవెల్ ఏజెంట్ల శిక్షణ తరగతులు   •   తెలంగాణ ఏర్పాటును ఏనాడూ జనసేన వ్యతిరేకించలేదు   •   ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి   •   మొదటి రోజున నూతనంగా చేరిన విద్యార్థులకు ఘనస్వాగతం   •   ప్రభుత్వ విద్యపై భరోసా.. కొడుకును ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన మచ్చుపేట సర్పంచ్   •   కర్కోటక కాంగ్రెస్ ప్రభుత్వం.. బెల్లంపల్లిలో కవిత హల్‌చల్‌   •   తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సబ్ కమిటీ సమావేశం   •   కార్మికుల దీక్షలకు స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ప్రత్యక్ష మద్దతు ఇవ్వాలి   •   యోగ దినచర్యలో భాగం కావాలి: జిల్లా ప్రోగ్రాం అధికారి   •  

ప్రైవేట్ బస్సు బోల్తా: ఐదుగురు మృతి, 20 మందికి గాయాలు

06-03-2026 02:16 PM

రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లోని(Chhattisgarh) జాష్‌పూర్ జిల్లాలో శుక్రవారం ఒక ప్రైవేట్ బస్సు బోల్తా(Private bus overturns) పడటంతో ఐదుగురు మృతి చెందగా, 20 మంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు. పొరుగున ఉన్న జార్ఖండ్‌లోని కుర్దేగ్ నుండి బస్సు ఛత్తీస్‌గఢ్‌లోని కుంకురి పట్టణం వైపు వెళుతుండగా ఈ ప్రహదం చోటుచేసుకుందని జాష్‌పూర్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ లాల్ ఉమేద్ సింగ్ తెలిపారు.

తప్కరా పోలీస్ స్టేషన్(Tapkara Police Station) పరిధిలోని గోడాంబ గ్రామం సమీపంలో డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోయాడని, దీంతో వాహనం బోల్తా పడిందని తెలిపారు. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మరణించగా, మరో 20 మంది గాయపడ్డారని అధికారి తెలిపారు.  సమాచారం అందుకున్న సీనియర్ పోలీసు అధికారులు, రెస్క్యూ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయని, గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుగుతోందని తెలిపారు.