2 March, 2026 | 3:11 PM

మృతుడి కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా అందజేత

02-03-2026 01:48 PM

కోనరావుపేట,(విజయక్రాంతి): కోనరావుపేట మండలం నిమ్మపల్లి గ్రామంలో గతంలో కరెంట్ షాక్‌కు గురై మృతి చెందిన అనుమల మహేందర్ కుటుంబానికి సెస్ వైస్ చైర్మన్ దేవరకొండ తిరుపతి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాన్ని పరామర్శించి, ప్రభుత్వం తరఫున అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సంబంధిత ఏఈ, గ్రామ సర్పంచ్ కమ్మరి స్వప్న నాగరాజు, ఉప సర్పంచ్‌ మనుక సత్యం,తో పాటు ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. విద్యుత్ ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని, గ్రామంలో భద్రతా ప్రమాణాలు పాటించాలన్నారు.