07-06-2025 04:52:10 PM
బీజాపూర్,(విజయక్రాంతి): ఛత్తీస్గఢ్(Chhattisgarh) బీజాపూర్ జిల్లా(Bijapur District)లోని ఇంద్రావతి జాతీయ ఉద్యానవనం ప్రాంతం(Indravati National Park Area)లో కొనసాగుతున్న ఆపరేషన్లో భద్రతా దళాలతో జరిగిన రెండు ఎన్కౌంటర్ల(Encounters)లో ఐదుగురు నక్సలైట్లు మృతి చెందినట్లు పోలీసులు శనివారం తెలిపారు. తాజా ప్రాణనష్టంతో, గత మూడు రోజుల్లో జరిగిన ఆపరేషన్లో అగ్ర నాయకులు సుధాకర్, భాస్కర్ సహా ఏడుగురు నక్సలైట్లు హతమయ్యారు. జిల్లాలోని ఇంద్రావతి జాతీయ ఉద్యానవనం ప్రాంతంలో కొనసాగుతున్న నక్సల్ వ్యతిరేక కార్యకలాపాల సమయంలో భద్రతా దళాలు ఏడుగురు మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నాయని ఓ సీనియర్ పోలీసు అధికారి పేర్కొన్నారు. ఇవాళ కాల్పుల తర్వాత రెండు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని, శుక్రవారం, శనివారం మధ్య రాత్రి జరిగిన కాల్పుల్లో మూడు మృతదేహాలను కనుగొన్నామని ఆయన చెప్పారు.
మావోయిస్టు నాయకుడు సుధాకర్, తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు బండి ప్రకాష్, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ (DKSZC) సభ్యుడు పప్పారావు, మరికొందరు సాయుధ కార్యకర్తల ఉనికి గురించి సమాచారం ఆధారంగా జూన్ 4న రాష్ట్ర పోలీసుల స్పెషల్ టాస్క్ ఫోర్స్ (Special Task Force), డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (District Reserve Guard) అలాగే సీఆర్పీఎఫ్(CRPF) ప్రత్యేక విభాగం CoBRA సిబ్బందితో కూడిన ఆపరేషన్ ప్రారంభించబడిందని అధికారి తెలిపారు. శుక్రవారం, ఛత్తీస్గఢ్-తెలంగాణలో రూ.45 లక్షల రివార్డును ప్రకటించిన మావోయిస్టుల తెలంగాణ రాష్ట్ర కమిటీ (Telangana State Committee) ప్రత్యేక జోనల్ కమిటీ (Special Zonal Committee) సభ్యుడు భాస్కర్ అలియాస్ మైలారపు అడెల్లును, ఛత్తీస్గఢ్లో రూ.40 లక్షల రివార్డును ప్రకటించిన మావోయిస్టుల కేంద్ర కమిటీ సభ్యుడు నరసింహ చలం అలియాస్ సుధాకర్ను గురువారం భద్రతా దళాలు మట్టుబెట్టాయి.
మరణించిన మరో ఐదుగురు నక్సలైట్ల గుర్తింపు ఇంకా నిర్ధారించబడలేదని అధికారి వివరించారు. వారిలో ఇద్దరు మహిళలు ఉన్నారని, ఈ ఆపరేషన్లో రెండు ఎకే-47 రైఫిల్స్తో సహా భారీ ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నామన్నారు. మిగిలిన మావోయిస్టు కార్యకర్తలను గుర్తించడానికి ఈ ప్రాంతాన్ని పూర్తిగా శానిటైజ్ చేయడానికి చుట్టుపక్కల అటవీ ప్రాంతంలో శోధనలు కొనసాగుతున్నాయని తెలియజేశారు. ఆపరేషన్ సమయంలో పాము కాటు, తేనెటీగలు కుట్టడం, డీహైడ్రేషన్, ఇతర ఆపరేషనల్ గాయాల కారణంగా కొంతమంది భద్రతా సిబ్బంది గాయపడ్డారని, వారికి మందులు అందించారని కోరారు. చట్టవిరుద్ధమైన సీపీఐ (మావోయిస్ట్) ప్రధాన కార్యదర్శి నంబల కేశవ్ రావు అలియాస్ బసవరాజు(70) మే 21న బస్తర్ ప్రాంతంలో హతమార్చబడ్డాడు.