calender_icon.png 7 June, 2025 | 11:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేవాలయ అభివృద్ధికి మరింత కృషి

07-06-2025 04:49:31 PM

మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి..

నల్లగొండ టౌన్ (విజయక్రాంతి): రేణుక ఎల్లమ్మ దేవాలయ అభివృద్ధికి మరింత కృషి చేస్తానని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Minister Komatireddy Venkata Reddy) అన్నారు. భక్తుల పాలిట కల్పవల్లి, కోరిన కోరికలు తీర్చే అమ్మ, క‌న‌గ‌ల్ మండ‌లం ధ‌ర్వేశిపురంలో కొలువైన‌ శ్రీ రేణుక ఎల్లమ్మ జమదగ్ని మహర్షి 23వ వార్షిక కల్యాణ మహోత్సవం సందర్భంగా శనివారం దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. 

మంగళ వాయిద్యాల న‌డుమ వేద పండితులు శ్రావణ్ కుమార్ చార్యులు, నాగోజు మల్లాచారి, సుదర్శనాచార్యులు, మంత్రిని పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ వెంకట్‌రెడ్డి ఈఓ జిల్లెప‌ల్లి జయరామయ్య, నల్ల‌గొండ మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీ‌నివాస్‌రెడ్డి, ప‌ట్ట‌ణాధ్యక్షుడు మోహన్ రెడ్డి, ఆలయ మాజీ చైర్మన్ గోపాల్ రెడ్డి, ఆలయ సీనియర్ అసిస్టెంట్ చంద్రన్న గౌడ్, నాగేశ్వరరావు, ఉపేందర్‌రెడ్డి, ఆంజనేయులు ధర్మకర్తలు పాల్గొన్నారు.