05-08-2025 12:51:32 AM
శిక్ష తోపాటు ఒక్కొక్కరికి 5000/-రూపాయల జరిమానా
రాజన్న సిరిసిల్ల: ఆగస్టు 4 (విజయక్రాంతి): ప్రభుత్వం,నేత కార్మికులను మోసం చేసిన కేసులో ఐదుగురు వ్యక్తులకు మూడు సంవత్సరాల జైలు శిక్షతోపాటు ఒక్కొక్కరికి 5000 రూపాయల జరిమానా విధిస్తూ సిరిసిల్ల ప్రథమ స్థాయి న్యాయమూర్తి ప్రవీణ్ సోమవారం తీర్పు వెల్లడించినట్లు సిరిసిల్ల పట్టణ సిఐ కృష్ణ తెలిపినారు.ఈమేరకు సీఐ మాట్లాడుతు..
ప్రభుత్వం సిరిసిల్లలో ఉన్న నేత కార్మికులకు పని కల్పించి ఆదుకోవాలనే ఉద్దేశ్యంతో సిరిసిల్లలో ఉన్న మ్యూచవల్లి ఆడెడ్ కోఆపరేటివ్ సొసైటీలో ఉన్న కార్మికులతో మాత్రమే బట్టలను తయారు చేయించి దాన్ని ప్రభుత్వం నిబంధనలో ప్రకారం కొనుగోలు చేయాలి దానిలో భాగంగా సిరిసిల్లలో ఉన్న జాగృతి మ్యాక్ సొసైటీ ముఖ్య సభ్యులు ఆగు కొండబత్తిని మల్లేశం అధ్యక్షులు బొల్లబత్తి లక్ష్మీనారాయణ ఉపాధ్యక్షులు కట్ల శ్రీనివాస్ కార్యదర్శి చింతకింది సత్యం డైరెక్టర్ మరియు బొడ్డు గోపాల్ డైరెక్టర్లు జెబి నగర్ సిరిసిల్ల అనువారు.
ప్రభుత్వం మరియు నేత కార్మికులను మోసం చేసి అధిక లాభాలు పొందాలని ఉద్దేశంతో నేత కార్మికులలో బట్టలను నియమించకుండా బయట నుండి బట్టలను కొనుగోలు చేసి ప్రభుత్వంకు అమ్ముచున్నారు.దీనిలో భాగంగా వారు బట్టలను వ్యవసాయం మార్కెట్ కమిటీ ఇందిరానగర్ సిరిసిల్ల గోదాంకు తీసుకురాగా టెక్స్టైల్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన సాంకేతిక అధికారులు పక్కకు పెట్టిగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు టెక్స్టైల్ పవర్ డిపార్ట్మెంట్లో ఏ.డి. పని చేస్తున్నా అశోక్ రావు తనిఖీ చేసి తేదీ 29.05.2017 రోజున సుమారుగా 13 లక్షల సరుకును సీజ్ చేసి జాగృతి మ్యాక్స్ సొసైటీ సభ్యులు కొండబత్తిని మల్లేశం బొల్లాబత్తిని లక్ష్మీనారాయణ,
కట్ల శ్రీనివాస్ ,చింతకింది సత్యం మరియు బొడ్డు గోపాలు అధిక లాభాలు పొందాలని ఉద్దేశంతో ప్రభుత్వం మరియు నేత కార్మికులను మోసం చేయగా వీరిపై అశోక్ రావు సిరిసిల్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా అప్పటి ఎస్.ఐ మాచినేని రవి కేసు నమోదు చేసి విచారణ అనంతరం విచారణ అధికారి అయిన శేఖర్ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసినాడు.