31-05-2025 12:00:00 AM
నిర్మల్, మే 30 (విజయక్రాంతి): నిర్మల్ ఎమ్మెల్యేగా ఎన్నికైన బీజేఎల్పీ నేత నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి కమిషన్లు తీసుకోవడంలో చూపిన శ్రద్ధ కర్షకుల కష్టాలను తీర్చడంలో చూపడం లేదని రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ న్యాయశాఖ మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం తన నివాస భవనంలో ఏర్పాటు చేసి న విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నేతలతో కలిసి మాట్లాడారు.
నిర్మల్ జిల్లాలో వరి ధాన్యం కొనుగోలలో ఎమ్మెల్యే మహేష్ రెడ్డి పర్సంటేజీలు తీసుకుంటున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గత వారం రోజులుగా వర్షాలు కురిసి రైతులు కొనుగోలు కేంద్రంలో ఆరబోసిన దాన్యంలో తేమా తూకం పేరుతో నిర్వగులు అక్రమాలకు పాల్పడుతున్న మహేశ్వర్ రెడ్డి ఎందుకు నో రు మోపడం లేదని విమర్శించారు. నిర్మల్ ఎమ్మెల్యేగా గెలిచి 16 నెలలైనా నిర్మల్ ని యోజక అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా తీసుకురాలేదని ప్రజలకు రైల్వే లైన్ అండర్ డ్రైనేజీ ఇతర హామీలతో మభ్యపెట్టు ఉన్నారని పేర్కొన్నారు.
నిర్మల్ జిల్లాలో ప్రభుత్వ ఆదాయంలోరులైన ఇసుక దోపిడీలో మహేశ్వర్ రెడ్డి అనుచరులు ఉన్నారని దీనిపై ప్రభుత్వం విచారణ జరపాలని కోరారు. జిల్లాలో స్వర్ణవాగుపై ఉన్న చెక్ డ్యామ్లో ధ్వంసం చేయడానికి మహేశ్వర్ రెడ్డి ఎలా అనుమతిచ్చారని ఇది అధికారుల తప్పిదముగా తాము భావించి రైతుల పక్షాన న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు.
ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీని అడ్డుకుంటున్న మహేశ్వర్ రెడ్డి గెలల కొనుగోలు కేంద్రాన్ని ఎలా ప్రారంభించారని సూటిగా ప్రశ్నించా రు. నిర్మల్ అభివృద్ధికి తాను ఎంతగానో కృషి చేశానని తన హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప ప్రస్తుతం ఏ అభివృద్ధి జరగలే దని తెలిపారు.
ఈ సమావేశంలో డిసిసిబివి వైస్ చైర్మన్ రఘునందన్ రెడ్డి ఎఫ్ఎసిఎస్ చైర్మన్ ధర్మాజీ రాజేందర్ మాజీ ఎంపీపీ మహిపాల్ రెడ్డి సింగిల్ విండో చైర్మన్ రమణ రెడ్డి ఇంద్రక రెడ్డి సోదరుడు సురేందర్ రెడ్డి మంజులాపూర్ పీఏసీ చైర్మన్ కృష్ణ ప్రసాద్ రెడ్డి పార్టీ నాయకులు శ్రీకాంత్ యాదవ్ రాందాస్ అప్పల మహేష్ ఊస రాజేశ్వర్ మాధవరావు మేడారు ప్రదీప్ వెలుగు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు