calender_icon.png 2 June, 2025 | 9:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నకిలీ విత్తనాలపై సర్కార్ నజర్

31-05-2025 12:00:00 AM

  1. జిల్లాలో టాస్క్ ఫోర్స్ టీం ఏర్పాటు
  2. సరిహద్దు ప్రాంతాల్లో చెక్‌పోస్ట్‌ల వద్ద ముమ్మరంగా తనిఖీలు

నిర్మల్, మే 30(విజయక్రాంతి): వానకాల సీజన్ ప్రారంభమైంది. తుఫాను ముందస్తు పవనాల కారణంగా జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రతి సంవత్సరం జూన్ 7 మగసిరా కార్తి తర్వాత వర్షాలు కురవడంతో విత్తనాలు వేసుకునేందుకు జూన్ చివరివాసంలో రైతులు సిద్ధమ య్యేవారు.

ప్రస్తుతం జిల్లాలో వారం రోజులుగా కురుస్తున్న వర్షాలు నేపథ్యంలో ప్రధా న పంటగా రైతులు సాగు చేసే పత్తి జొన్న సోయ బీచ్ మొక్కజొన్న పప్పు దినుసు పం టలు  వరి  పంటలు సాగు చేసేందుకు సిద్ధమవుతున్న తరుణంలో విత్తనాల సేకరణ రైతులు ప్రధాన దృష్టి పెట్టారు. అయితే జిల్లాలో ప్రధానంగా సాగు చేసే పంటలు పత్తి పంట 2.60 లక్షల ఎకరాలు సోయపం ట1. 20 లక్షల ఎకరాలు వరి 1.40 లక్షల ఎకరాలు సాగవుతుండగా మిగతాయి పప్పు దినుసు పంటలు పసుపు ఇతర పంటలు సా గు చేస్తారు.

జిల్లాలో వాన కాలంలో వర్షా ఆధారంగా పంటలు సాగు చేస్తున్న రైతులు తమ పంట భూములు సదులు చేసుకుని విత్తనాలు వేసేందుకు కావలసిన విత్తనాలను సేకరిస్తున్న నేపథ్యంలో నకిలీ విత్తనాల నియంత్రణపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నిర్మల్ జిల్లాలో ప్రధానంగా పత్తి విత్తనాలు స్వయ విత్తనాలు నకిలీ నిర్వహించేందుకు జిల్లా టాస్క్ ఫోర్స్ టీమ్‌ను ఏర్పాటు చేసి ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.

ప్రభుత్వం పత్తి విత్తనాల బ్యాగుదలను గత ఏడాది రూ.864లు నిర్ణయించగా ఆ ఏడాది రూ.36లు పెంచి రూ.901లకు పెంచింది దీంతో ప్రభుత్వ సాట్ఫిడ్ విత్తనాలను మాత్రమే రైతులు కొనుగోలు చేయాలని తప్పకుండా రసీదు తీసుకోవాలని అధికారులు గ్రామస్థాయిలో అవగాహన కల్పిస్తూ నే కల్తీ విత్తనాల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నారు. 

టాస్క్ ఫోర్స్ టీం ఏర్పాటు..

నిర్మల్ జిల్లాలో విత్తనాల కొరత నకిలీ విత్తనాల నేతలకు జిల్లాస్థాయిలో టాస్క్ఫోర్స్ టీమ్లు ఏర్పాటు చేశారు. నిర్మల్ జిల్లాలో 450 విత్తనాలు ఎరువుల దుకాణాలు ఉండ గా ఇప్పటికీ ఆయా దుకాణాల్లో నిలువ ఉం చిన వివిధ రకాల పత్తి మొక్కజొన్న వారి సోయా విత్తనాల రికార్డులను అధికారులు ప్రతిరోజు ఆన్లైన్లో తనిఖీ చేస్తున్నారు.

ఇప్పటికే మంచిర్యాల కాగజ్నగర్ అదిలాబాద్ జిల్లాలో నకిలీ విత్తనాలు పట్టబడ్డ నేపథ్యంలో నిర్మల్ జిల్లా అధికారులు కూడా అప్రమత్తమై సరిహద్దు ప్రాంతాలైన సారంగాపూర్ అప్పారావుపేట్ బిదిరెల్లి తదితర ప్రాంతాల్లో వాహనాల తనిఖీ నిర్వహించి నకిలీ విత్తనాలు గుర్తించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

జిల్లాలో టాస్క్ ఫోర్స్ టీమ్ ఏర్పాటు చేయగా ఇందులో వ్యవసాయ శాఖ సహాయ సంచారకులు పోలీస్ శాఖ ఏఎస్పి రాష్ట్ర విత్తన అభివృద్ధి అధికారి ఆధ్వర్యంలో టీమ్లు నిర్మల్ బైంసా ఖానాపూర్ పట్టణ ప్రాంతాలతో పాటు మండల కేంద్రం లో ఉన్న విత్తనాలు ఎరువులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. కొన్ని రకాల ఇతరులకు మార్కె ట్లో డిమాండ్ ఉండడంతో అవి బ్లాక్ మార్కె ట్ తరలించకుండాలో నిఘా పెట్టారు.

నకిలీ విత్తనాలు అమ్మిన వాటిని కొన్న చట్టరీత్యా నేరమని అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అవగాహన కల్పిస్తున్నారు. జిల్లాలో వ్యవసాయ శాఖ ఆధ్వ ర్యంలో 79 రైతు వేదికలో వ్యవసాయ విస్తరణ అధికారులు నకిలీ విత్తనాలను గుర్తించ డం ఎలా విత్తనాలు కొనుగోలు చేసినప్పుడు రైతు తీసుకోవలసిన జాగ్రత్తలు రిసిప్ట్ లాట్ నెంబర్ రిజిస్ట్రేషన్ లైసెన్స్ ఉన్న దుకాణాల వివరాలు రైతులకు వివరించి నష్టపోకుండా చర్యలు చేపడుతున్నారు.

జిల్లాలో భైంసా, నిర్మల్, ఖానాపూర్ పట్టణంలో గల ఏజెన్సీ ల ద్వారానే ఎక్కువ విత్తనాలు గ్రామీణ మం డల ప్రాంతాలకు తరలించి అక్కడ రైతులకు ఈ విత్తనాలను విక్రయిస్తున్న నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న విత్తన డీలర్లకు సైతం సమావేశం నిర్వహించి నకిలీ విత్తనా లు నేతలకు ప్రతి ఒక్కరు సహకరించాలని ఒక వేళ విత్తనాలు అమ్మితే వారిపై పీడీ యాక్ట్ పెడతామని, లైసెన్స్‌లను రద్దు చేస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు. 

జిల్లాలో ముమ్మరమైన తనిఖీలు

రైతులు వ్యవసాయ సీజన్ ప్రారంభించిన నేపథ్యంలో విత్తనాలు కొనుగోలు చేస్తున్నందున జిల్లాలో నకిలీ విత్తనాల నియంత్రణపై జిల్లా అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారులతో పాటు డివిజన్ అధికారులు మండల అధికారులు ఏఈవోలు ఆయా ప్రాంతాల్లో ఉన్న విత్తన దుకాణాలకు వెళ్లి వివిధ విత్తనాల స్టాక్ వివరాలు రిజిస్టర్లో నమోదు క్రయవిక్రయాలవి వివరాలు ప్రతిరోజు ఆన్లైన్ నమోదు తత్తర వివరాలను పక్కాగా పరిశీలించి అనుమానం.

వస్తే జిల్లా టాస్క్ఫోర్స్ టీమ్లకు సమాచారాన్ని అందిస్తున్నారు పత్తి విత్తనాలు దుప్పటి సోయా వరి విత్తనాలపై కూడా అధికారులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ సర్టిఫైడ్ సర్టిఫికెట్ ఉన్న విత్తనాలు మాత్రమే విక్రయించాలని సర్టిఫైడ్ లేని విత్తనాలు వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. రైతులు కూడా తమ పంట భూముల్లో పత్తి విత్తనాలు ఇతర విత్తనాలు సాగు చేసే రైతులు ఒకే రకం విత్తనాలు కోసం డిమాండ్ చేయకుండా మంచి విత్తనాలను ఎంచుకొని వ్యవసాయ శాఖ అధికారుల సూచన మేరకు నడుచుకోవాలని పిలుపునిస్తున్నారు.

నకిలీ విత్తనాలు పట్టుబడితే కఠిన చర్యలు: కలెక్టర్ అభిలాష

నిర్మల్ జిల్లాలో కల్తీ విత్తనాలు నియంత్రించేందు కు జిల్లా టాస్క్ ఫోర్స్ టీం ఏర్పా టు చేయడం జరిగిందని నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. ఇప్పటికే జిల్లాలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో అన్ని దుకాణాలను తనిఖీ నిర్వ హించి విత్తన వివరాలను కయవిక్రయాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగిం దన్నారు.

నకిలీ విత్తనాలు ఎక్కడ అమ్మిన రైతులు తమ దృష్టికి వస్తే వెంటనే వ్యవసాయ శాఖ అధికారులకు తెలుపాలని సూచించారు. జిల్లాలో సరిహద్దు ప్రాం తాల్లో ప్రత్యేక నిఘా పెంచడం జరిగింద ని వివరించారు. విత్తన డీలర్లు కూడా ప్రభుత్వ నిబంధనలను కచ్చితంగా పాటించాలని లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.