30-05-2025 11:38:15 PM
సూర్యాపేట(విజయక్రాంతి): విజయవాడకు చెందిన ప్రముఖ ఎక్స్ రే సాంస్కృతిక సంస్థ ప్రతి ఏటా స్వర్గీయ ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని స్మారక అవార్డులను అందజేస్తుంది. దీనిలో భాగంగా ఈ సంవత్సరం రెండు తెలుగు రాష్ట్రాలలోని వివిధ రంగాలలో ప్రముఖులైన వారిని ఈ అవార్డుకు ఎంపిక చేసింది. మనం వికాస వేదిక స్థాపించి, గత మూడు దశాబ్దాలుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో సాహితీ, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించిన సూర్యాపేటకు చెందిన పెద్దిరెడ్డి గణేష్ ను ఈ అవార్డ్ వరించింది. నేడు విజయవాడలోనీ సిద్దార్థ కళాశాల ఆడిటోరియంలో ఈ అవార్డ్ ప్రధానం జరగనున్నది.
ఈ అవార్డును ప్రముఖ నటులు
నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ కు ఎన్టీఆర్ విశిష్ట పురస్కారాన్ని ఇవ్వనున్నారు. పెద్దిరెడ్డి గణేష్ కు ఈ అవార్డ్ రావటం తో జిల్లా వ్యాప్తంగా ఉన్న సాహితీ ప్రియులు శుభాకాంక్షలు తెలిపారు.