అటవీ శాఖ ఉద్యోగుల ర్యాలీ
04-03-2026 12:00 AM
నిర్మల్, మార్చి ౩ (విజయక్రాం తి): ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం సందర్భంగా నిర్మల్ జిల్లా అటవీ కార్యాలయం నుండి బస్టాండ్ వరకు అటవీ సిబ్బంది బైక్ ర్యాలీనీ మంగళవారం నిర్వహించారు. వన్యప్రాణుల సంరక్షణ అడవుల సంరక్షణపై నినాదాలు చేశారు. అటవీ శాఖ కార్యాలయం నుండి బస్టాండ్ వరకు ఈ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని నిర్మల్ అటవీ క్షేత్రాధికారి రామకృష్ణారావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాథోడ్ రమేష్ ఎఫ్ఆర్ఓ బైంసా, సంతోష్, నజీర్ఖాన్, రాజశేఖర్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్లు, సెక్షన్ఆఫీసర్లు, బీట్ ఆఫీసర్లు పాల్గొన్నారు.




